CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్ర బాబు తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతి వేగంగా వచ్చిన జేసీబీ ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.