నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీఈవో విద్యా రమ ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా 2025 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్ సవరణ బడ్జెట్, అంచనా బడ్జెట్పై సమీక్షిస్తామన్నారు.