CTR: జిల్లాలోని 2వ పట్టణ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సంతపేటకు చెందిన నలుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నిందితుల నుంచి రూ.48 వేల నగదుతోపాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెట్టింగ్ వ్యసనం జీవితాలను సర్వ నాశనం చేస్తుందని, వాటి జోలికి ఎవ్వరూ వెళ్లకూడదంటూ హెచ్చరించారు.