KDP: మైదుకూరు మండలం వనిపెంట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో తీవ్ర గాయాలైన యువకుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తన కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.