SRD: ప్రజలకు సైబర్ మోసాలు బెట్టింగ్ యాప్స్పై అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సివిల్ తగాదాలు తల దూర్చవద్దని సూచించారు.