NRML: నిర్మల్ కలెక్టరేట్లో మంగళవారం, బుధవారం జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డీపీఆర్వో విష్ణు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరం ఉంటుందన్నారు.