NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ బసవేశ్వర కాలనీలో ఇళ్ళ మధ్యలో మురుగు నీరు నిలవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటి కారణంగా, దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా విపరీతంగా పెరిగిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి, మురుగు నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.