VZM: పట్టణంలోని తోటపాలెం, వైఎస్ఆర్ కాలనీ నుండి ప్రదీప్ నగర్లో SBI బ్రాంచ్ వరకు 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలువురు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను సులువుగా గుర్తించవచ్చన్నారు. అలాగే పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.