SRPT: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు కోరారు. శనివారం నూతనకల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో వరి నాట్లు వేసిన రైతులకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.