VZM: గరివిడి మండలం వెదుళ్ల వలస గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ కంచు మోజు రామ్మోహన్ రావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెనుమత్స సాంబ మూర్తి రాజు ఆధ్వర్యంలో గీత పారాయణం, సత్సంగ ప్రవచనం కార్యక్రమం జరిపారు.