KDP: వేంపల్లి మండలలోని కుప్పాలపల్లెలో తాళ్లపల్లి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో నూతన ధ్వజస్తంభ, నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు.