ASR: ప్రభుత్వం ఏదైనా గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, యుద్ధం తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యూరు మండలంలోని డౌనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 11,12వ తేదీల్లో చేపడుతున్న మన్యం బంద్ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.