అన్నమయ్య: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలకు వేసిన డ్యూటీని ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద నిపుణులైన డాక్టర్లను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.