U-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ విశ్వ విజేతగా అవతరించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 82 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్లో మన తెలుగమ్మాయి త్రిష(44) రాణించడంతో.. భారత్ కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.