KRNL: పెద్దకడబూరులోని సచివాలయం – 2 వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీపీ శ్రీవిద్య జాతీయ జెండాను ఎగుర వేశారు. సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ సుజాత, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు.