KRNL: చిప్పగిరి మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయం, ZPHS పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విరుపాక్షి హాజరయ్యారు. విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలు అమోఘమన్నారు.