ఏలూరు: జిల్లాలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన తెలుపుతూ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన 8 మంది విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.