GNTR: రేపు కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా, వన్ మ్యాన్ కమీషన్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, షెడ్యూల్డ్ కుల సంఘాలతో ప్రతినిధుల నుంచి ఉదయం 10 గంటల నుంచి అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు చేశామని అన్నారు.