కడప: పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల్ల గ్రామంలో నివాసం ఉంటున్న పిల్లి కావ్య అనే వివాహిత అదృశ్యం అయినట్లు భర్త మల్లికార్జున పోరుమామిళ్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. కావ్య గత 4 రోజుల క్రితం పోరుమామిళ్లకు తన ఇంటి నుంచి ఆటోలో వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, తన బంధువులను విచారించి ఆచూకీ తెలియకపోవడంతో ఫిర్యాదు చేశానన్నారు.