పల్నాడు: మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 25వ తేదీ రాత్రి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ఇద్దరూ ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా SP కంచి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. గొడవ మద్యం మత్తులో జరగలేదని అన్నారు. వాళ్ల వ్యక్తిగత విషయంలో జరిగిందని.. తమ దృష్టికి రావడంతో హోంగార్డును సస్పెండ్ చేయడంతో పాటు కానిస్టేబుల్పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.