KKD: విద్యుత్ ఛార్జీలు పెంపునకు జగన్మోహన్ రెడ్డే కారణమని TDP రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు విమర్శించారు. శనివారం సాయంత్రం పెద్దాపురంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైఎస్ జగన్ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.