ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో భూమిక అనే మహిళ ప్రయాణికురాలి జత బంగారు కమ్మలు, రూ.9వేల నగదును దొంగలు అపవారించారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందిన భూమిక గుంతకల్కు వెళ్తుండగా గుత్తి బస్టాండ్లో బ్యాగులో ఉన్న ఆ సామాగ్రిని అపవారించారు. ఈ సంఘటనపై ఎస్సై సురేష్ బస్టాండ్కి వెళ్లి విచారణ చేపట్టారు.