ఖమ్మం: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగియనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా ఆడిన జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పోటీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.