CTR: పుంగనూరు విశ్రాంత ఎంపీడీవో రామమ్మ (65) అనారోగ్యం కారణంగా బుధవారం ఉదయం మృతి చెందారు. పుంగనూరులో 35 ఏళ్ల క్రితం టైపిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పుంగనూరు ఎంపీడీవోగా పనిచేసి 2014లో పదవీవిరమణ పొందారు. రామమ్మ మృతిపట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారుల సంతాపం వ్యక్తం చేశారు.