ప్రకాశం: ఒంగోలు మండలంలోని గుండాయపాలెం వద్ద బకింగ్ హామ్ కాలువ మీద హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో పోర్ట్ షిప్పింగ్, జలమార్గాల కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని ఆయన కార్యాలయంలో కలిశారు. గుండాయపాలెం నుంచి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో బకింగ్ హామ్ కెనాల్ మీద హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.