KDP: మండల కేంద్రమైన దువ్వూరు-1 గ్రామ సచివాలయం పరిధిలో రబీ సీజన్లో సాగైన పంటలను నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి మినుము, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, శనగ ఇంకా ఇతర పంటలను రైతులు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారి కోరారు.