GNTR: నీటి సంఘాల ఎన్నికలలో ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారు అభివృద్ధికి కృషి చెయ్యాలని ఎమ్మెల్యే తెలిపారు.