అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం చేయరాదని ఎస్పీ విద్యా సాగర్ నాయుడు స్పష్టం చేశారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.