SKLM: ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అమరావతిలో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. చిరుధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాయితీపై ఇస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగ చేసుకోవాలన్నారు.