KRNL: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కర్నూలులో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు ఎద్దుల బండ్లతో తరలివచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.