NZB: విద్యార్థిని కొట్టిన ఘటనలో టీచర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని తప్పు చేస్తే మందలించాల్సింది పోయి తీవ్రంగా దండించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు దేవిక, మనోజ్, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.