అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం పట్టణంలోని దొంతి వీధి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో ముగ్గురు సచివాలయ సిబ్బంది గైర్హాజరు కావడం.. రిజిస్టర్లో సంతకాలు లేకపోవడంపై తోటి సిబ్బందిని ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిపై శాఖపరమైన చర్యలకు సిఫారసు చేస్తున్నట్లు వెల్లడించారు.