MNCL: దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను లక్షెట్టిపేట కోర్టు అధికారులు, శుక్రవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. అదే రేంజ్లో పనిచేస్తున్న బియ్యాల అంజన్నను అధికారులు తొలగించడంతో, గోదావరిఖనిలోని లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కోర్టు ధిక్కరణ చేయడంతో ఫర్నిచర్ను కోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.