ప్రకాశం: రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం కలెక్టర్ ఆఫీస్లో DRO ఓబులేష్కు వినతి పత్రం అందజేశారు.