WNP: జిల్లాలో ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూపు-2 పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30, మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదన్నారు. 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు.