కృష్ణా: నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఉద్దేశించిన తాత్కాలిక భవనంలో ప్రభుత్వ కార్యాలయాలను ఎలా ఏర్పాటు చేస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత ఈనెల 11న కార్యాలయాలకు ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. వెంటనే 2 కార్యాలయాలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్నారు.