NZB: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గురు స్వామి బాలకృష్ణ చేపట్టిన గోమాత మహాపాదయాత్ర బుధవారం ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. అయ్యప్ప స్వాములు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ధర్మాన్ని కాపాడుకోవాలని, గోమాతను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో గురుస్వామి నగేష్ శర్మ, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.