GNTR: పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు పరిశీలించారు. రోడ్లు, నీటి సదుపాయాలు, విద్యుత్, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.