కృష్ణా: నూజివీడులో ఈ 20న ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఏపీ ఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.