CTR: చామంతిపురం వద్ద సుబ్రహ్మణ్యం, ఆటొ చిట్టి, రాజేష్ అనే ముగ్గురిని అరెస్టు చేసి రూ.62,340 విలువ చేసే 2.078 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.