WNP: ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా పరమేశ్వరచారి, ఢీ కురుమయ్య, సాయిలీల, ఆదిలు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డాక్టర్ లేక స్కానింగ్కు గర్భిణీలు బయటికి వెళ్లాల్సి వస్తుందన్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేదన్నారు. వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.