SKLM: రణస్థలం మండల జేఆర్పురం గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి వరప్రసాద్ తండ్రి నరసింగారావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆయన స్వగృహంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి బానోజీ నాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.