KRNL: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ప్రారంభించారు. డాక్టర్ అరుణ్ కుందవరం ఆధ్వర్యంలో 180 మంది మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా హోమియో మందులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.