JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో దివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులు చిన్నయ్య, రాజేశ్వర్, తహశీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.