ప్రకాశం: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని జిల్లా జైలును మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్యామ్ బాబులు జైలును సందర్శించి, అనంతరం ఖైదీలకు కల్పించిన సదుపాయాలను వారు పరిశీలించారు.