KMM: సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని మంగళవారం ఎమ్మెల్యే రాగమయి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, అభివృద్ధి కార్య క్రమాలపై మంత్రి పొంగులేటితో ఎమ్మెల్యే చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.