TG: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. దీంతో వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి నిలయంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.