ADB: సమిష్టి నిర్ణయాలతోనే సంఘం అభివృద్ధి చెందుతుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండలంలోని గిర్నూరు గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను తెలియజేయగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.