కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం సమీకరించిన నిధులతో ఆదివారం అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లిపాలెంలో 350 వరద బాధిత కుటుంబాలకు వంటపాత్రలు, కుక్కర్లు, బకెట్లను పంపిణీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లను ఎంపీపీ సుమతి దేవి, సర్పంచ్ విజయ్ కుమార్, మండల జనసేన అధ్యక్షుడు గుడివాక శేషుబాబు అందజేశారు.