SKLM: ఎచ్చెర్ల మండలం నారాయణపురం కుడి ప్రధాన కాలువ శివారు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఈ ఖరీఫ్ సీజన్లో అందలేదని మండల మాజీ జడ్పిటీసీ సభ్యులు సనపల నారాయణరావు శనివారం తెలిపారు. సాగునీటి సమస్య పై ఆన్లైన్ చేసిన అర్జీ పత్రాన్ని ఈనెల 23న జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందించడానికి స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.